కొత్తూరులో ఘనంగా మైసమ్మ పండుగ

కొత్తూరులో ఘనంగా మైసమ్మ పండుగ

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్,కౌన్సిలర్స్,గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు

30 ఏళ్ల తర్వాత మళ్లీ టౌన్ లో పండుగ వాతావరణం

బోనాల ఊరేగింపు.. పోతురాజుల విన్యాసాలు

లోకల్ గైడ్ కొత్తూరు

కొత్తూరు మున్సిపాలిటీలో రెండు రోజులపాటు మైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఎరుపులమ్మ కవిత, పోతురాజు కృష్ణయ్య సమక్షంలో గ్రామ పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు.బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు,డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ..30 ఏళ్ల తర్వాత మళ్లీ టౌన్ లో పండుగ వాతావరణం కనబడుతుందని అన్నారు.అమ్మవారులకు నైవేద్యాలు సమర్పించి కొత్తూరు మున్సిపాలిటీ చల్లంగా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్,కౌన్సిలర్స్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News