హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు
-బీజేపీ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని..అనూష మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గల రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్, వాహనాలు, తిరగలేని పరిస్థితి ఉన్నవి, అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హఫీజ్ పేట్ డివిజన్ లో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి అన్ని అన్నారు. ఈ సమస్యలను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా నాయకులు, అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Latest News
