ఏసీబీ వలలో అవినీతి చేప!

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మమడ ఎస్సై అశోక్

ఏసీబీ వలలో అవినీతి చేప!

నిర్మల్ : లోకల్ గైడ్ :
నిర్మల్ జిల్లా మమడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని, ఏసీబీ (అంటీ కరప్షన్ బ్యూరో) అధికారుల వలలో పడిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఎస్సై అశోక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం, మొండిగుట్ట గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తికి సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుపతిపై చీటింగ్ కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, అలాగే రియల్టర్‌తో భూమి సెటిల్‌మెంట్ చేయించేందుకు ఎస్సై అశోక్ మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి ₹40,000 లంచం డిమాండ్ చేశాడు.

తరువాత జరిగిన బేరసారాల్లో ₹20,000కు ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఉచ్చుపన్నిన అధికారులు, ఎస్సై అశోక్ లంచం స్వీకరిస్తున్న సమయంలో అతను నివసిస్తున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే పట్టుకున్నారు.

ఈ ఘటనతో మమడ పోలీస్ స్టేషన్‌పై ప్రజల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే అవినీతికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్సై అశోక్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన