కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ

ఈరోజు కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన

కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ

కామారెడ్డి లోకల్ గైడ్

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు షబ్బీర్ అలీ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించారు.

ప్రార్థనల అనంతరం షబ్బీర్ అలీ  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు సహనానికి నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.
 ఆకలి విలువను తెలుసుకుంటూ, పేదలకు సహాయం చేయడమే ఈ పండుగ యొక్క అసలు పరమార్థమని వివరించారు.
 గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ