మొక్కజొన్న రైతులకు బాసట

మద్దులపల్లి మార్కెట్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న రైతులకు బాసట

శుభకార్యక్రమలకు హాజరు

 లోకల్ గైడ్: ఖమ్మం 
-

ఖమ్మం : రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్ లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనితతో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శుభకార్యక్రమలకు హాజరు
అలాగే కూసుమంచి మండలం లోక్య తండా గ్రామంలో జరిగిన  పలు వివాహ వేడుకలకు తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారుడు దండి రామారావు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!