కారు చీకట్లో ఎన్ఎస్పి  క్యాంప్ లో రంగన్న ప్రచారం..

కారు చీకట్లో ఎన్ఎస్పి  క్యాంప్ లో రంగన్న ప్రచారం..

 మిర్యాలగూడ జనవరి 29
( లోకల్ గైడ్ తెలంగాణ )

మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గురువారం రాత్రి పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో తిరిగి చీకట్లోనే ఓటును అభ్యర్థించారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో కారు చీకట్లోనే తిరిగారు.ప్రజా సమస్యలపై స్పందించే అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు అక్కడే ఉన్న ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ లో బ్లాక్ టీ తాగి అందర్నీ టీ తాపించి వామపక్ష అభ్యర్థులు గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై దృష్టి సారించింది అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారని విన్నవించారు.వామపక్షాల తరపున రంగంలో ఉన్న వారిని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్,వీరేపల్లి వెంకటేశ్వర్లు సర్పంచ్ మూడవత్ రవి నాయక్, సయ్యద్ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు