నూతన గుడి నిర్మాణానికి విరాళం

వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం నుండి గుడికి ₹40,000 విరాళం

నూతన గుడి నిర్మాణానికి విరాళం

లోకల్ గైడ్ షాద్ నగర్)

గ్రామ అభివృద్ధితో పాటు ధార్మిక కార్యక్రమాలకు తమ సహకారాన్ని చాటుకుంటూ వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారు గుడి అభివృద్ధికి ₹40,000 (నలభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.గుడి అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘంగా ముందుకు వచ్చి ధార్మిక సేవలకు తోడ్పాటు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ “సంఘంగా ఐక్యంగా గుడి అభివృద్ధికి సహకరించడం ఆదర్శనీయం. గౌడ సంఘం సేవాభావం ప్రశంసనీయం” అని అన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతమంది సంఘాలు చేయాలని, వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారి సహకారం గుడి అభివృద్ధికి శాశ్వతంగా నిలుస్తుందని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు.చివరగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు