కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు లేని లోటు తీరనిది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన..అనిల్ కుమార్ యాదవ్.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు లేని లోటు తీరనిది.

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి హఠాత్తుగా మరణించడం తీవ్రంగా కలచివేసిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. పార్టీ, ప్రజా ఉద్యమాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

విష్ణు భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్, ఈ అకాల మరణం కుటుంబానికి, గ్రామానికి, నియోజకవర్గ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు