ఎవరీ చైల్డ్ రీడ్స్ ప్రోగ్రాం
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి చేతులపై గేట్ కారేపల్లి ప్రధానోపాధ్యాయురాలుకి ఘనంగా సన్మానం.
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, జనవరి 29 : కారేపల్లి మండలం గేట్ కారేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి చేతులమీదుగా ఘనంగా సన్మాన్నించడం జరిగింది.జిల్లా కలెక్టర్ పిల్లల భౌశత్తుకై ఎంతో ప్రతిష్టమ్మకంగా చేపట్టిన ఎవరీ చైల్డ్ రీడ్స్ ప్రోగ్రాం లో భాగంగా ప్రతీ విద్యార్థి చక్కగా చదవటం, వ్రాయటం, లెక్కలు చేయడం అనే అంశాలపై నాలుగు పాఠశాలలను సెలెక్ట్ చెయ్యడం జరిగింది. అందులో భాగంగా గేట్ కారేపల్లి ఉన్నత పాఠశాల కూడా ఉన్నడటం మండల ప్రజల అదృష్టం.గేట్ కారేపల్లి ప్రధానోపాధ్యాయురాలు వై. రాధ మేడం గారు పిల్లల పట్ల ఎంతో శ్రద్ధను చూప్పించి వారి ఎదుగుదల్లో, తోటి అధ్యాపక బృందం తో ప్రతీ రోజు పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ చూప్పించి మంచి మార్గంలో లో నడుపుటకై అధ్యపాక బృందం తో అహర్నిశలు కష్టపడినందుకు గాను విద్యార్థులు కనపర్చిన ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి చేతులమీదుగా ప్రధానోపాధ్యాయురాలు వై. రాధ మేడం కు ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది. తదనంతరం కారేపల్లి మండల విద్యశాఖధికారి దుగ్గిరాల జయరాజు ప్రత్యేకంగా వై. రాధ మేడం కు అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమం లో గేట్ కారేపల్లి ఉన్నత పాఠశాల అధ్యపాకబృందం పాల్గోని అభినందనలు తెలిపినారు.
