ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు యాదవ రాజు కాటమరాజు జయంతి ఉత్సవాలు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి..భేరి రామచందర్ యాదవ్

ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు యాదవ రాజు కాటమరాజు జయంతి ఉత్సవాలు.

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

యాదవ రాజు కాటమరాజు జయంతి ఉత్సవాలు-2026ను పురస్కరించుకొని ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవరాజు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో తదుపరి లక్ష్యంగా కాటమరాజు జయంతి వేడుకలను ప్రతి ప్రాంతంలో ప్రజాపాల్గొనడంతో నిర్వహించాలని ఆయన తెలిపారు. చంద్రవంశ క్షత్రియ యాదవ వంశానికి చెందిన ఆత్రేయ గోత్రీకుడైన కాటమరాజు, శ్రీకృష్ణ పరమాత్మ వంశానికి చెందినవాడని వీరగాథలు పేర్కొంటున్నాయని అన్నారు. గోవుల రక్షణ కోసం నల్లసిద్ధిరాజుతో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన మహావీరుడు కాటమరాజు అని, దేశంలో అరుదుగా రాజులకు గుడులు ఉండగా కాటమరాజు కు దక్షిణ భారతదేశమంతటా గుడులు ఉండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వారని వంశవృక్షాల ద్వారా తెలుస్తోందని, కనిగిరి ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప పరాక్రమ శాలి అని వివరించారు. కాకతీయ సామ్రాజ్య కాలంలో నల్లసిద్ధిరాజుతో జరిగిన యుద్ధంలో కాటమరాజు విజయం సాధించగా, ఈ కథాచక్రాన్ని యాదవభారతంగా పిలుస్తారని పేర్కొన్నారు. కాటమరాజు జయంతి వేడుకలు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించేలా యాదవ సమాజం ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు