పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
పఠాన్ చేరు నియోజకవర్గంలోని చైతన్య నగర్లో ఉన్న శ్రీ మహా దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలను త్రయాహ్నిక దీక్షతో ఘనంగా నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 16, 2026 వరకు జరగనున్నాయి. పఠాన్ చేరు ఎమ్మెల్యే, ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్గా ఉన్న మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గూడెం యాదమ్మ, అలాగే గూడెం కల్పన-మధుసుధన్ రెడ్డి దంపతులు మహోత్సవ ఏర్పాట్ లలో భాగస్వాములయ్యారు. వేద బ్రాహ్మణుల నిర్ణయాను సారం మాఘ బహుళ ద్వాదశి (2026 ఫిబ్రవరి 14) నుంచి మాఘ బహుళ చతుర్దశి (2026 ఫిబ్రవరి 16) వరకు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు గోపూజ, గణపతి పూజ, అఖండ దీపారాధన, గణపతి హోమం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. రెండో రోజు రుద్రసహిత మన్యుసూక్త హోమాలు, ప్రదోషకాల పూజలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, రాత్రి మహా లింగోద్భవకాలంలో మహాభిషేకాలు నిర్వహిస్తారు. చివరి రోజు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, ధ్వజ అవరోహణం, అవబృత స్నానం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మహా శివరాత్రి మహోత్సవాల లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు.