హైదరాబాద్ ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ప్రతినిధి)
డీడీ కాలనీ మరియు నారాయణగూడ నారాయణ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు 21/02/2026న నారాయణగూడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక రంగాలలోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలను ప్రదర్శించారు.కార్యక్రమం సాంప్రదాయ దీపప్రజ్వలనంతో ప్రారంభమై, ప్రిన్సిపాళ్లు శ్రీమతి సవిత గారు మరియు శ్రీమతి విశాఖ గారి స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. తమ ప్రసంగాల్లో వారు విద్యాసంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీ బాలపరమేశ్వర రావు గారు, ఆర్ & డి విభాగాధిపతులు శ్రీ మనోహర్ గారు, శ్రీమతి మీనా గారు, శ్రీమతి మహేశ్వరి గారు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు శ్రీ ఆజాద్ గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నూర్ గారు, శ్రీమతి రాధిక గారు పాల్గొన్నారు. ఇక ఈకిడ్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి సిరిష గారు, శ్రీమతి ప్రవీనా గారు, ఈచాంప్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి మొబిన్ ఉన్నిసా గారు, శ్రీమతి నసీమ్ ఉన్నిసా గారు, హైస్కూల్ అకడమిక్ డీన్లు శ్రీ ప్రసన్న గారు, శ్రీ మహేష్గారు,పరిపాలనాధికారులు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు, శ్రీ జూబేద్ గారు కార్యక్రమాన్ని అలంకరించారు. వారు విద్యార్థులకు ఉత్తేజభరితమైన సందేశాలు అందించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించారు.