అభివృద్ధి పనులకు శంఖస్థాపన ---చేసిన మేయర్

ఈరోజు సీసీ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

అభివృద్ధి పనులకు శంఖస్థాపన ---చేసిన మేయర్


 ఖమ్మం: లోకల్ గైడ్ :

ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్‌ శ్రీనివాస్ నగర్లో ఈరోజు సీసీ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు హాజరైన కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.
మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.49 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాంత అభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రెయినేజీ సౌకర్యాలు అందించేందుకు కార్పొరేషన్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ధనాల రాధా, 27 వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేష్,
డివిజన్ నాయకులు ధనాల వెంకటరమణ, ధనాల శ్రీకాంత్, శ్రీనివాసరావు, భుజంగరావు, పద్మ వెంకన్న, కోటేశ్వరరావు, జహీర్ రెడ్డి 
 అధికారులు,  డి ఇ నరేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ పవన్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి.... ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం పాలేరు నియోజకవర్గంలో రెండు...
త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం 
శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి కళ్యాణ మహోత్సవం.
నూతన జిజిహెచ్ నిర్మాణం  స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ