శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు

టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి..ఐదు బృందాలుగా విభజించి తనిఖీలు

శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి కార్యాలయంలోని పలు విభాగాలలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. భవన అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, ఫైళ్ల ప్రాసెసింగ్‌లో అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సంబంధిత ఫైళ్లు, రికార్డులు, కంప్యూటర్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న అధికారుల వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ తనిఖీలతో జిహెచ్ఎంసి కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అధికారులు సోదాలు పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..