జిల్లా స్థాయి బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
బాలమేళా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ ప్రారంభించారు.
By Ram Reddy
On
జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల చర్లలో ఘనంగా నిర్వహించిన చర్ల మండలం బాలమేళా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ ప్రారంభించారు. విద్యార్థులకు గుణవాత్మక విద్యను, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి కాంప్లెక్స్ స్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులు 1 నుండి 5 తరగతి వరకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో తెలుగు ఆంగ్లము గణితం నుండి ఐదుగురు విద్యార్థులు చొప్పున, కథలు చెప్పడంలో తరగతికి ఒకరు చొప్పున 1 నుండి 9 తరగతులకు 9 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినదన్నారు. మండలంలోని అన్ని కాంప్లెక్స్ ల ప్రధానోపాధ్యాయులు బిసమ్మ గారు మంజుల, హరి ప్రసాద్ పాల్గొని, విజేతలకు మేమంటోలు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా సీహెచ్ వేణుగోపాల్, పీ పద్మావతి, డీ దేవమణి, డీ దారయ్య, ఏం రవి బాబు, జీ వెంకటకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు, సీఆర్పిలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 08:07:52
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
