టి జి యూ ఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.
2026కి సంబంధించిన డైరీ, క్యాలెండర్ను బుధవారం మిడ్జిల్ మండల ఎంఈఓ సరస్వతి ఆవిష్కరించారు.
By Ram Reddy
On
తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీజీయూ ఏస్ నూతన సంవత్సరము 2026కి సంబంధించిన డైరీ, క్యాలెండర్ను బుధవారం మిడ్జిల్ మండల ఎంఈఓ సరస్వతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యతో పాటు విలువలు పెంపొందించే విధంగా బోధన సాగించాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టి జి యూ ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు తారా సింగ్, మిడ్జిల్ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్, కోటియా , టి జి యూ ఎస్ నాయకులు తారా సింగ్, శంకర్ నాయక్తో పాటు మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
