రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి : మంత్రి పొంగులేటి

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి : మంత్రి పొంగులేటి


ఖమ్మం: లోకల్ గైడ్IMG-20260126-WA0073
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.  77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు