కొమురవెల్లి మల్లన్న స్వామి పట్నం వారోత్సవాలలో

పాల్గొన్న తుమ్మల పాండు రంగారెడ్డి

కొమురవెల్లి మల్లన్న స్వామి పట్నం వారోత్సవాలలో

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

కొమురవెల్లి మల్లన్న స్వామి పట్నం వారోత్సవాల సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ జోగిని శ్యామల నిర్వహించిన సంప్రదాయ బోనం కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ..కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పట్నం వారోత్సవాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నల్ల మాధవ్ రెడ్డి, సోనైల యాదగిరి, నరసింహ రెడ్డి, ఎల్లకొండ మహేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న టీ కొట్టు నిర్వాహకులు రాజు తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తుల జయజయధ్వానాలతో ఘనంగా జరిగింది.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు