_ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నూతన భవనం మెడికల్ విద్యార్థుల వసతిగృహాలను ఆరోగ్య శాఖ మంత్రివర్యులు
దామోదర రాజా నరసింహ చేతులు మీదుక ప్రారంభించారు
_జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 08 (లోకల్ గైడ్ ప్రతినిధి)
ఎర్రగడ్డ డివిజన్లోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నూతన భవనం మరియు మెడికల్ విద్యార్థుల వసతిగృహాలను ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ ప్రారంభించారు. .ఆసుపత్రి సూపరిండెంట్ అనిత రావి రాల వారి సిబ్బందితో కలిసి మంత్రి కి ఎమ్మెల్యే కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారుఅనంతరం నూతన భవనంలోని భోజనశాల, వసతి గృహంలోని గదులు, ఎమర్జెన్సీ మరియు ఆబ్జర్వేషన్ వార్డులను పరిశీలించారు.అలాగే మెడికల్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్లో లేని వైద్య పరికరాల గురించి కూడా విచారించారు.డ్రగ్స్ మద్యానికి బానిసలైన రోగుల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.శానిటేషన్,సర్వీస్ కేర్ మరియు పేషెంట్ కేర్కు సంబంధించిన అంశాలు, అలాగే తమ జీతాల పెంపు గురించి స్థానిక ఎమ్మెల్యే కి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.ఈ నూతన సౌకర్యాలు రోగులకు, మెడికల్ విద్యార్థులకు ఎంతోఉపయోగపడతాయనిఎమ్మెల్యే,పేర్కొన్నారు.కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటాచారి డాక్టర్ క్రిస్టియనో డిఎంఓ నరేందర్ డి హెచ్ రవీందర్ నాయక్ ఐ ఎం హెచ్ మెడికల్ విద్యార్థులు. టి జూడ విక్రమ్ చంద్రకాంత్ రెడ్డిలు అనిత రావిరాల స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
