ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి 82వ జయంతి సందర్భంగా

సాహిత్య సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి 82వ జయంతి సందర్భంగా

 

కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 08 (లోకల్ గైడ్ ప్రతినిధి)

ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనమైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ కవి, లలిత గేయకళానిధి, రసమయి అధ్యక్షులు డా॥ ఎం.కె. రాముకి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా  జరిగింది.సభకు అధ్యక్షత వహించనున్న డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వ కాళోజీ నారాయణరావు తొలి పురస్కార గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు పొందినవారు. సభను డా॥ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు ప్రారంభించారు. .విశిష్ట అతిథులుగా డా॥ టి. గౌరీశంకర్, మాజీ రిజిస్ట్రార్ (సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం), అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత డా॥ నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఆచార్య గంటా జలంధర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు, సుప్రసిద్ధ జర్నలిస్టు రచయిత  చీకోలు సుందరయ్య, ప్రముఖ కవయిత్రి  అమ్మంగి కవితాస్వామి, అలాగే  ఎం. ఆనంద్ తదితరులు హాజరయ్యారు.ఈ సాహిత్య సదస్సుకు సమావేశ సంధానకర్తగా రా॥ అన్నం పొండయ్య వ్యవహరించారు. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యవర్గ సభ్యులు సాహిత్యాభిమానులు, రచయితలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా ఆచార్య చెన్నకేశవ రెడ్డి  సాహిత్య సేవలను స్మరించుకోవడంతో పాటు, డా॥ ఎం.కె. రాముగారి సాహిత్య కృషిని గౌరవించటం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!