మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు.
నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా. బిజెపి-బీఆర్ఎస్ నాయకులవి దిగజారుడు రాజకీయాలు.p
గన్ మెన్ల కోసం వారి తాపత్రయం. చిల్లర రాజకీయాలు మానుకోవాలి. తప్పుడు ఆరోపణలు, విమర్శనలు చేస్తే చూస్తూ ఊరుకోం. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా (లోకల్ గైడ్)
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక బిజెపి-బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించారు.శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నల్లగొండ పట్టణంలోని 1 నెంబర్ వినాయక విగ్రహం వద్ద గణేష్ నిమజ్జనం రోజు బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వారిద్దరి దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్సవ కమిటీ ఆహ్వానంతో నిమజ్జనం రోజు ఒకటో నెంబర్ విగ్రహం వద్దకు రావడం జరిగిందని అన్నారు.
మంత్రి మాట్లాడుతుండగా
తనను పైకి పిలవలేదని అక్కసుతో బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఘర్షణ వాతావరణం సృష్టించాడని ఆరోపించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.150 కోట్లతో లతీఫ్ షాప్ గుట్ట, బ్రహ్మంగారి ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పాడు తప్ప కాంగ్రెస్ చేస్తుందని చెప్పి రాజకీయాలు చేయలేదన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడికి కనీస రాజకీయ అవగాహన లేదని ధ్వజమెత్తారు.ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటే బిజెపి జిల్లా అధ్యక్షుడు ఇది జీర్ణించుకోలేక పోయాడని అన్నారు.ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించారని అన్నారు.
అనంతరం అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడని విమర్శించారు.బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే గన్మెన్ల కోసం పాకులాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులతో దాడులు చేయించుకుని గన్ మెన్ లు పెట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.గన్ మెన్ల కోసం
ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్న వీరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.మేము దేవుని దగ్గర ఎన్నడూ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 25 సంవత్సరాలుగా అభివృద్దే ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడని అన్నారు.
వ్యక్తిగతంగా, పరోక్షంగా 10 వేల మందికి సహాయం అందించాడని అన్నారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నోటి దురుసు వలన గత ఎన్నికల్లో ప్రజలు 54 వేల ఓట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని గెలిపించడం జరిగిందని అన్నారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తి కూడా యూరియాపై చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, స్థాయిని మించి మంత్రిపై విమర్శనాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజక వర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నాడని అన్నారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు.నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు.మాజీ ఎమ్మెల్యేను ప్రజలు గత ఎన్నికలలోనే చీకొట్టారని, అతనిని ఎప్పుడో మరిచిపోయారని అన్నారు.చిల్లర రాజకీయాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మేము సహనం కోల్పోతే గణేష్ నిమజ్జనం రోజే వారిద్దరికీ గన్ మెన్లు వచ్చేవారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన సాగుతుందని పేర్కొన్నారు.అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.రాజకీయ లబ్ధి కోసం బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుంటారని విమర్శించారు.ఎక్కడ లేని విధంగా నల్లగొండలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉందని ధ్వజమెత్తారు.
గణేష్ నిమజ్జనం రోజు నల్లగొండలో జరిగిన సంఘటనే నిదర్శనం అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిటీ సభ్యుడు కుసుకుంట్ల రాజిరెడ్డి,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్, నాయకులు బొజ్జ శంకర్, సురిగి వెంకన్న గౌడ్,యూత్ కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, పిల్లి యాదగిరి యాదవ్, పెండెం పాండు,ఎగ్గడి సుజాత, బొబ్బలి స్వరూప రెడ్డి, పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.