విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఉచిత విద్యుత్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); నాటి విద్యుత్ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి అన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దూమ్ లో బషీర్ బాగ్ విద్యుత్ పోరాటం లో అమరవీరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు చలో హైదరాబాద్ పిలుపునిస్తే ర్యాలీకి అప్పటి రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. చలో హైదరాబాద్ ర్యాలీపై నరహంతకుడు చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు జరిపిన లాఠీచార్జి, తుపాకుల కాలుపుతో ముగ్గురు అమరులు అయి ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరిగిందని పేర్కొన్నారు. నాటి అమరుల స్ఫూర్తితో నేడు విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్న విధానాలపై సంఘటితంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కర్ర సైది రెడ్డి, సహాయ కార్యదర్శి, వి లెనిన్, నందం, ముండ్ల ముత్యాలు, కోమటిరెడ్డి ప్రద్యుమారెడ్డి, ఎస్ కె మదర్, యూసుఫ్, వీరయ్య,సుజాత, విజయ,ధనలక్ష్మి, సర్దార్,చంద్ నాగమ్మ,రేణుక, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.