మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.

మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.


పాలకుర్తి (లోకల్ గైడ్ )
పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, తొర్రూరు పట్టణంలో తమ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని పాలకుర్తి వైపు ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలోని వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.
ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అనుకోకుండా కిందపడడంతో గాయాలపాలయ్యారు. పరిస్థితిని గుర్తించిన వెంటనే ఎమ్మెల్యే తమ వాహనాన్ని ఆపించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యవసరంగా వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని భావించిన వారు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో గాయపడిన దంపతులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యసహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ ఘటనను చూసిన స్థానికులు ఎమ్మెల్యే  స్పందనకు ప్రశంసలు కురిపించారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిగా వ్యవహరించి ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చారని అభినందించారు.
ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే  ఈ సందర్భంగా తెలిపారు. ఈ సంఘటన ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు