బాధితులకు భరోసా..110 ఖాతాలు డీఫ్రీజ్..డీసీపీ సాయి మనోహర్

సంతోషం వ్యక్తం చేసిన ఖాతాదారులు

బాధితులకు భరోసా..110 ఖాతాలు డీఫ్రీజ్..డీసీపీ సాయి మనోహర్

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయిన నిజమైన ఖాతాదారులకు ఉపశమనం కల్పిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక “డీ-ఫ్రీజ్ ఖాతాల మేళా” నిర్వహించారు. ఈ సందర్భంగా 110 బ్యాంక్ ఖాతాలను డీ-ఫ్రీజ్ చేసి ఎన్‌ఓసీలు అందజేశారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ మాట్లాడుతూ, ఎన్ సిఆర్ పి ద్వారా ఫ్రీజ్ చేసిన ఖాతాలను సవివరంగా పరిశీలించి, లావాదేవీల ధృవీకరణ అనంతరం నిజమైన ఖాతాదారులను గుర్తించి చట్టపరమైన విధానాల ప్రకారం డీ-ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై అవగాహన కల్పించామని, సైబర్ నేరస్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సైబర్ మోసాల బాధితులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల ఆధారంగా అనుమానిత ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేసి నిధులను రక్షించే చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ముందస్తు చర్యగా ఫ్రీజ్ చేసిన కొన్ని ఖాతాలు మోసాలకు సంబంధం లేని వ్యక్తులవని గుర్తించి డీ-ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్‌ఓసీలు అందుకున్న ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 కు కాల్ చేయాలి. https://www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపిలు అపరిచితు లతో పంచుకోవద్దు. అనుమానా స్పద కాల్స్, మెసేజ్‌లు, ఆన్‌లైన్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు విజయ్ కుమార్, శివప్రసాద్, దుర్గా రామలింగప్రసాద్, రామిరెడ్డి, రాఘవేందర్, మధు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు