నారాయణపేట ఫిబ్రవరి 25:
న్యాయవాదుల వృత్తి నిర్వహణలో తమ బాధ్య తలు నిర్వహిస్తున్న న్యాయ వాదుల పరిరక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నారాయ ణపేట జిల్లా కోర్టు ముందు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు బుధవారం3వ రోజుకు చేరుకున్నాయి.ఇప్పటివరకు జరిగిన దాడులలో దాదాపు 51 మంది న్యాయవాదులు బలైన కారణంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న న్యాయ వాద పరిరక్షణ బిల్లును వెంట నే చట్టంగా మార్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి జరుగుతున్న న్యాయ వాద పాదయాత్రలకు మద్ద తుగా నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరాహార దీక్ష కొనసాగింది.ఈ దీక్షలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సీని యర్ న్యాయవాది నారా యణ ఇతర న్యాయవాదులు నిరాహార నిరాహార దీక్షలో కూర్చున్నరు. న్యాయవాదు లకు పూలమాలనేసి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘు వీర్ యాదవ్,కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందు నామాజీ కూర్చోబెట్టా రు.ఈ కార్యక్రమంలో నరసిం హులుయాదవ్ ,విజయభాస్కర్ రెడ్డి టి రామచంద్రయ్య, రవికుమార్ ,శ్రీకాంత్ చామకూర, వినోద్ కుమార్, అమిరుద్దీన్ ,క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ 5: రీలే దీక్షలో ఉన్న న్యాయవాదులు
______________________