పెంజర్ల గ్రామ పంచాయతీ 10 % భూమి అమ్మకానికి పాలకుల ఫిర్యాదుతో వెలుగు చూసిన అక్రమాలు..

సిల్వర్ ప్రైడ్ వెంచర్ లో రూ.1 కోటి విలువైన భూమి

పెంజర్ల గ్రామ పంచాయతీ 10 % భూమి అమ్మకానికి పాలకుల ఫిర్యాదుతో వెలుగు చూసిన అక్రమాలు..

అక్రమాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలనీ పెంచల గ్రామ ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి డిమాండ్  కదలిన గ్రామపంచాయతీ పాలకవర్గం

లోకల్ గైడ్ కొత్తూరు.

ఎన్నో ఏళ్ల క్రితం వెంచర్ చేసి అందులో 10% గ్రామపంచాయతీ స్థలాన్ని ప్రభుత్వానికి కేటాయించగా, సదరు విలువైన భూమిపై కొందరు అక్రమార్కులు కన్ను వేశారు. సందిట్లో సడే మీయగా వెంచర్ ప్లాన్ మార్చి ప్లాటుగా చూపించి దాదాపు 10 గుంటల పైచిలుకు భూమిని ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అక్రమాన్ని గమనించిన కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ ఉపసర్పంచ్ మామిడి శాంతన్ రెడ్డి ఆధ్వర్యంలో పదిమంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పెద్ద ఎత్తున మండల తహసిల్దార్ రవీందర్ రెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీకి సంబంధించిన స్థలాన్ని తప్పుదారి పట్టించి అమ్ముకోవాలని చూస్తున్నారని దీనికి రిజిస్ట్రేషన్ కూడా సిద్ధమైందన్న సమాచారం తమ వద్ద పక్కాగా ఉండడంతో దీనిని అడ్డుకోవాలని గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు గ్రామ సభ్యులు ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం రంగంలోకి దిగడంతో సెక్రటరీ గౌస్ సదరు వెంచర్ భూమిలో ప్లాటుగా మార్చిన వైనంపై పరిశీలించి పాలకవర్గం ఒత్తిడితో అక్కడ ప్రత్యేక సూచిక బోర్డును గ్రామపంచాయతీ స్థలంగా  పాతించారు. 
సుమారు 12 గంటల గ్రామపంచాయతీ 10% స్థలం దాని విలువ కోటి రూపాయల పై మాట అని కొందరు ఇందులో కుట్ర చేసి సదరు భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసే విక్రయించేందుకు ఓ మాఫియా ప్రయత్నిస్తుందని గ్రామ ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి మీడియాకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మామిడి భారతమ్మ, కాటం రమాదేవి, డి మహబూబ్ జి, కే వసంత చారి, రామునంట్ల రాములు, షేక్ హార్బల్, మంద మాధవి, ఏ మాధవి, శారద, గ్రామ కార్యదర్శి గౌస్, గ్రామ పెద్దలు మంద శీను, కావలి శేఖర్, వన్ని జంగయ్య, షమియోద్దీన్
తదితరులు కలిసి తహసిల్దార్ రవీందర్ రెడ్డి కి లికిత పూర్వక ఫిర్యాదు చేసినట్లు ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి తెలిపారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం