మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ 

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం మంగళవారం బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లతో దాడి,మంత్రి వివేక్ వాహనంపై దాడికి పాల్పడిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.ఈ దాడులలో పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కు తీవ్ర గాయాలు కాగా అతనిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించినట్లు తెలిపారు.ఈ కేసులలో నిందితులుగా ఉన్న మాజి ఎమ్మెల్యే బాల్క సుమన్,మూల రాజిరెడ్డి,అనిల్,రామిడి లక్ష్మీకాంత్ లను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.మిగతా నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.త్వరలోనే వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు