వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కుమారులకు పోలీసుల కౌన్సిలింగ్

టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం

వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కుమారులకు పోలీసుల కౌన్సిలింగ్

సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి25:సిద్దిపేట్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట త్రీ టౌన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు తమ కష్టార్జిత ఆస్తులను సమానంగా పంచి ఇచ్చినప్పటికీ, సరైన పోషణ పొందడం లేదని 18-03-2026 నాడు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాటా లక్ష్మీబాబు ఈరోజు తేదీ 25-03-2026 నాడు ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి కుమారుని ప్రాథమిక బాధ్యత అని, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వారిని వృద్ధాప్యంలో ఆదరించడం, పోషణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ చూడడం కుమారుల కర్తవ్యమని వివరించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగాను శిక్ష అర్హులని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం కుమారులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని, ప్రతి నెల ఖర్చులకు సరైన డబ్బులను అందిస్తామని, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు అందరూ కలిసి వైద్యసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ టాటా లక్ష్మీబాబు మాట్లాడుచు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ గారు వృద్ధుల గురించి ప్రత్యేక దృష్టి సారించినందున వృద్దులైన తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకుల గురించి ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించబడునని, వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, ప్రతి కుటుంబం దీనిని కచ్చితంగా పాటించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఖమ్మంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని తెల్పినారు. 
ఇన్స్పెక్టర్ గారి జోక్యంతో కుటుంబ వివాదం సఖ్యతగా పరిష్కారమవడంతో వృద్ధ దంపతులు పాముకుంటా నర్సయ్య-ఎల్లవ్వలు పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం