గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట; ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట; ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

శంషాబాద్ ఫిబ్రవరి 9 (లోకల్ గైడ్);

శంషాబాద్ మండలం పాల్మకూల్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని మహిళా సంఘాలు మరియు స్థానిక అవసరాల కోసం కేటాయించిన నిధులతో నిర్మించనున్న భవనాలకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ఎన్.ఆర్ఇజిఎస్ కింద మంజూరైన  నిధులతో గ్రామ 3 (వివో) భవన నిర్మాణానికి *30 లక్షల రూపాయలతో* శంకుస్థాపన చేశారు.
15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కేటాయించిన *20 లక్షల రూపాయలతో* నిర్మించనున్న పల్లె దావకాన  భవనానికి కూడా భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.మహిళా సంఘాల బలోపేతానికి వివో భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా నాణ్యతతో ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కట్కూరి కోటేశ్వర్ గౌడ్,
డిప్యూటీ సర్పంచ్ గూడెపు కుమార్ మరియు వార్డు సభ్యులు ఎంపీడీఓ మున్ని , జిల్లా వైద్యాధికారి లలితా దేవి , వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు ,పాలమాకుల గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఐటమ్ ఎండ్.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం