ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం.
సంత్ సేవలాల్ జయంతి సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ ను సన్మానించిన బంజారా సోదరులు
.
రంగారెడ్డి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 14,( లోకల్ గైడ్ ): ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో పిహెచ్ డీ పట్టా పొందడంపై పలువురు బంజారా సోదరులు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆదివారం ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ ను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. 2018 లో పొలిటికల్ సైన్స్ విభాగం లో " ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏ స్టడీ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్" అనే అంశంపై పరిశోధన చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరి గూడెం మండలంలోని గాలి గూడెం నంద్యా తాండకు చెందిన లక్ష్మి బొట్య నాయక్ నాలుగవ సంతానం అయిన ప్రొఫెసర్ రాజు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి పట్టా పొందడం అభినందనీయమని పలువురు బంజారా నాయకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజు నాయక్ మాట్లాడుతూ ... కడు పేదరికం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోనే తెలంగాణకే పునాది రాయిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో తాను పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ తనకు మంచి జ్ఞానాన్ని, భవిష్యత్తును ఇచ్చిందని ప్రొఫెసర్ రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, తన ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన న్నారు. తనకు దక్కిన ఈ డాక్టరేట్ నాపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.
