దుబ్బతండ లో ముమ్మరంగా శానిటేషన్ పనులు

సర్పంచ్ మత్రు నాయక్ ఆధ్వర్యంలో

దుబ్బతండ లో ముమ్మరంగా శానిటేషన్ పనులు

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 17 :

సింగరేణి మండలం, దుబ్బ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఆంగోత్ మత్రు, ఉపసర్పంచ్ భూక్యా బాబి ఆధ్వర్యంలో దుబ్బతండా,మేకల తండా గ్రామాల్లో శానిటేషన్ పనులు ముమ్మరంగా నిర్వహించబడినవి. గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ మత్రు పాలకవర్గం, గ్రామ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి స్వయంగా పనుల్లో పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి రహదారులను శుభ్రపరచడం, చెత్తను తొలగించడం, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.IMG-20260217-WA0277  ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సర్పంచ్ ఆంగోత్ మత్రు చురుకైన నాయకత్వం, సేవాభావం, గ్రామాభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
లోకల్ గైడ్   కేశంపేట్: సేవా భావంతో చిరునవ్వును పంచుతూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నందిగామ బైపాస్...
_ఈ వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా కోక్లియా ప్రపంచంలో తొలి మరియు ఏకైక స్మార్ట్ ఈయరింగ్ ఇంప్లాంట్ సిస్టమును భారత్ కు తీసుకువచ్చింది
మిర్యాలగూడలో ఘనంగా హోళీ సంబురాలు చేసిన.
ఘోర రోడ్డు ప్రమాదం.
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: వరంగల్ సీపీ
ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ 
హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రశాంతంగా జరు పుకోవాలి