పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోండి -
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలాస్.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): పాఠశాలల్లో సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఐ ఏ ఎస్ నవీన్ నికోలస్ సూచించారు. సోమవారం అత్తా పూర్ రాంబాగ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను ప్రశ్నించి వారి అభ్యాస స్థాయిలను పరిశీలించారు.
పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే సరిచేయాలన్నారు. అలాగే విద్యార్థుల అభ్యాస స్థాయిలను 15 రోజులలోపు మెరుగుపరచాలని ఆదేశించారు.
పాఠశాలలో పరిశుభ్రత పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం గమనించిన డైరెక్టర్ స్కావెంజర్ను వెంటనే తొలగించి పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు.
అదనంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ప్రతిపాదిత పాఠశాల స్థలాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్శనలో మండల విద్యాధికారి కె. శంకర్ రాథోడ్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
