నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
అందించాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కోరారు.
నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి యాజమాన్యాలకు సూచించారు. సోమవారం మిర్యాలగూడ రోడ్డు లోని బిటిఎస్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్.కే సూపర్ మార్కెట్ ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో నాణ్యమైన వస్తువులు,సరుకులు పట్టణ ప్రజలకు అందించి,పట్టణంలో వ్యాపార దిగ్గజాలను తలదన్నే విధంగా నడుచుకొని ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ ఆలీ, స్థానిక కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి గణేష్,కార్పొరేటర్ లు ఇబ్రహీం, ఇర్ఫాన్,సమ్మర్,ఆర్.కే సూపర్ మార్కెట్ యజమాని షేక్ అబ్దుల్ కరీం సాబ్,సభ్యులు షేక్ సలీం,షేక్ అసిన్ బేగ్, షేక్ హుస్సేన్ సాబ్, షేక్ హిమాంబి, అస్మిన్ సుల్తానా, షేక్ కమీల్ సాబ్, అబ్దుల్ షరీఫ్, షేక్ లతీఫ్ భాష, షేక్ సైదిబ్ బి, తదితరులు పాల్గొన్నారు
