నారాయణపేట ఫిబ్రవరి 25:
ఇంటి బిల్లు మాత్రం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మాత్రం దొరలకు ఇందిరమ్మ ప్రజాపాలన ఎటు పోతోందని నారాయణపేట మండల బిజెపి కార్యదర్శి శివ కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇల్లు లేదు భూమి లేదు కనీసం టూ వీలర్ బైక్ కూడా లేదు భర్త చనిపోయినాడు పొట్టకూటికై ఇద్దరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్లో బతుకుతున్న వంటి ఆనంద మ్మ ఇల్లు కూలి 10 సంవ త్సరాలు అవుతుందన్నారు. రేకులు వేసుకొని బ్రతుకు తుందనీ తెలిపారు. కానీ ప్రజా పాలనలో దరఖాస్తు చేయగా ఇందిరమ్మ ఇల్లులో లబ్ధి పొందలేదన్నారు. జలాల్పూర్ గ్రామంలో 30 ఇండ్లు మంజూరు అయినా కూడా అందులో కేవలం కాంగ్రె స్ కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నారు. భూమి ఉన్న వాళ్లకు ఫోర్ వీల్ ఉన్నవాళ్లకు అని చట్టం పెట్టినా కూడా అన్ని ఉన్నవాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందనీ తెలి పారు. ఏమీ లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నా కూడా వారికి ఇల్లు మంజూరు లేదనీ వితంతు పింఛను తీసుకోవ డానికి వెళ్తే ఇంటి పన్ను కట్ చేసుకొని మిగతావి ఇవ్వడం జరిగిందనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదేనా ప్రజాపాలన అని ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. పేదలకు ఇల్లు ఇవ్వకపోతే బిజెపి ఆందోళన చేపడుతుం దని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్: ఇంటి పన్ను చెల్లించాలని ఇల్లు కూలిన మహిళ కు నోటీసు
_____________________