ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ.

రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. 

ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ.

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 20 ( లోకల్ గైడ్ ) :
జగిత్యాల జిల్లాలో శుక్రవారం రోజున  ఆర్డీవో కార్యాలయంను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. 
అలాగే  తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా  పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తూ అలాగే మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీ లు జరగకుండా  ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన మరియు నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయి ల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
 ఈ పరిశీలనలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్, తహసీల్దార్ లు రామ్మోహన్, వరందన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం