నీటి సంరక్షణ నీటి పోదుపు, పై అవగాహన.
భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్ మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద
By Ram Reddy
On
ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్ మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ నీరు లేకుండా మన జీవితాలు చాల కష్టమని, ప్రతి పని నీటితో కూడుకున్నదని మన నీరు జీవితానికి అత్యవసరమని తెలియజేశారు. నీరు భూగర్భ జలాల వినియోగం, నిర్వహణ నీటి సంరక్షణ పద్ధతులు గురించి రైతులకు వివరంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు. ఈ కార్యక్రమము లో వ్యవసాయ పరిశ్రమల శాఖ ద్వారా నీటి పొదుపు పద్ధతులు పాటించినందున వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో , ఆర్ డబ్ల్యు ఎస్.,ఎఇఇ మత్చ్య శాఖ, సర్పంచ్, గ్రామ పంచాయతి కార్యదర్శి వారు మాట్లాడుతూ ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం, పొదుపుగా నీటిని వాడుకోవాలి రైతులకు తెలియజేశారు. భూగర్భజల శాఖ యొక్క అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
