నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా
పెన్షనర్ల బకాయిలను వెంటనే ఇవ్వాలి
By Ram Reddy
On
టాప్ రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి.
మిర్యాలగూడ మార్చి 24
( లోకల్ గైడ్ తెలంగాణ )
ఈ పెన్షన్ల సాధన కొరకు ఎన్సిసిపిఏ అదే విధంగా సివిల్ పే అసోసియేషన్ రెండు ఆర్గనైజేషన్లు న్యాయపోరాటం చేస్తుందని అందులో భాగంగానే ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా తలపెట్టామని ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. సి పి సి ని అమలు చేయాలని అది అమలు అయ్యేంతవరకు ఫిట్మెంట్ ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2024 లో పదవి విరమణ చెందినవారికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం చెప్పినట్లుగా బకాయిలను ప్రతినెల 700 కోట్లు కాకుండా 1000 కోట్లు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు పెంచాలని అన్నారు. 2600 మంది పెన్షనర్లు హైకోర్టుకు తమ బకాయిల కొరకు వెళ్లారని అలాంటి వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు దుర్వాసన తీర్పులిచ్చిందని దానికి రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రెటరీ అంగీకరించినట్టు తెలిపారు. పెండింగ్ లోనున్న ఐదు డిఏలను పిఆర్సిని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈహెచ్ఎస్ పథకంలో గురుకులాల్లో పని చేస్తున్న లైబ్రరీలో పనిచేస్తున్న వారికి సంస్థలలో పనిచేస్తున్న వారికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో టాప్రా నాయకులు జగదీష్ చంద్ర శ్యాంసుందర్ అబ్దుల్ ఖాదర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
