మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....

లోక‌ల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఇచ్చిన ర్యాలీ పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. మీరా-భయాందర్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేతో పాటు పాల్ఘర్ జిల్లాలో కూడా ఎంఎన్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వీడియోను ఎంఎన్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.మీరా-భయాందర్‌లో ఎంఎన్ఎస్ మోర్చాకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ర్యాలీ రూటును మార్చాలని సూచించినప్పటికీ, పార్టీ అంగీకరించలేదని ఆయన ఆరోపించారు.భాషా వివాదం జూలై 1న భయాందర్‌లో  గురైయింది. ఆ రోజు ఫుడ్‌స్టార్ షాప్ ఓనర్‌పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మరాఠీ మాట్లాడకపోవడం కారణంగా అతడిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోధ్‌పూర్ స్వీట్స్ షాప్‌లో ఉద్యోగి హిందీ మాట్లాడడంతోనే ఈ వివాదం మొదలైందని గుర్తించారు.ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడితో పాటు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు కూడా మహారాష్ట్రలో భాషా వివాదాన్ని మరింత ఉద్రిక్తతకు తీసుకెళ్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి