మెగా వైద్య శిబిరాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి...            

మెగా వైద్య శిబిరాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి...            

   మందులు వాడేకంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..పోలీస్ కమీషనర్ వెల్లడి..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్  పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు మెగా వైద్య శిబిరంను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి మెగా వైద్య శిబిరం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడు విధులు నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.. ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్నిరకాల ఆహర పదార్థలలో కల్తీ చాలా జరుగుతుందన్నారు. కొన్ని వ్యాదులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాదునిక వైద్య సదుపాయాలు అందుబాటులో గలవని, ప్రత్యేకంగా ,ఆర్.బి.ఎస్, కంటి పరీక్ష, ఇ.సి.జి. 2డి ఈకో, క్యాన్సర్ స్క్రిన్నింగ్, బిపి, షుగర్, మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.. మనకు అందించే అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. ప్రతీ సంవత్సరం ఒక్కసారైన ఆరోగ్యం కోసం డాక్టర్ల ద్వారా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రతలు తీసుకోవడం మంచిదన్నారు.ఇలాంటి క్యాంప్ ల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.. ఈ క్యాంప్ మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వాహిస్తారని దీనిని  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది,పోలీస్ కార్యలయం సిబ్బంది  పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది హోమ్ గార్డ్సు మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావు , నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి పి. శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ (అడ్మిన్ ), శేఖర్ బాబు ( ఎమ్.టి.ఓ ), తిరుపతి ( వెల్ఫేర్ ), సతీష్ (హోమ్ గార్డ్సు) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్  డాక్టర్ సరళ, మరియు డాక్టర్లు  సుధాకర్ రావ్ ( సీనియర్ కార్డియాక్ సర్జన్ ) చంద్ర మోహన్ ( కార్డియాలాజిస్ట్ ) ,  వంశీ ( జనరల్ ఫిజీసియిన్ ) , అఫ్రిన్ ( గైనకొలేజిస్ట్) , నిఖిత (అన్ కలజీస్ట్ ) , షాహాభాజ్ హైమద్ ( ఆర్థో పెడిక్ ),  జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి