మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్ష
విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుని సమయానికి పరీక్ష రాశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు
By Ram Reddy
On
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం చర్ల మండలంలోని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమై విజయవంతంగా ముగిశాయి. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుని సమయానికి పరీక్ష రాశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. మొదటి రోజు జరిగిన పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎంఈవో రమణ మాట్లాడుతూ, పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. మిగతా పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Tags:
About The Author
Latest News
23 Mar 2026 13:11:56
కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి)
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్రైజ్
