ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు

ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సహకారంతో హనుమాన్ గుడి వద్ద హ్యాండ్ బోర్‌ను ఏర్పాటు

ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 19 :

కారేపల్లి మండల పరిధిలోని పొలంపల్లి తండా గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సహకారంతో హనుమాన్ గుడి వద్ద హ్యాండ్ బోర్‌ను ఏర్పాటు చేసినట్లు పిఎస్ఆర్ యూత్ అధ్యక్షులు జర్పల ధోని నాయక్ సర్పంచ్ హేమలత తెలిపారు. బోర్ డ్రిల్లింగ్ పనులను సర్పంచ్ ధారావత్ హేమలత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన ధోనీ నాయక్‌ను అభినందించారు. గ్రామ అభివృద్ధే తమ లక్ష్యమని, ముందు ముందు గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గుగులోతు సక్రు, ధారావత్ బద్రునాయక్, ఉప సర్పంచ్ గుగులోతు సర్వన్, వార్డు సభ్యులు లావణ్య, రమేష్, కవిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీముడు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కల్యాణ్, గ్రామ పెద్దలు ధారావత్ భద్య, భూక్యా బద్రు, గుగులోతు భీముడు, మునీరాం, రమేష్, భూక్యా బాలు, లాలు, లక్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
కొందుర్గు లోకల్ గైడ్ : మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి...
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి 
వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.