న్యాయవాదుల నాల్గవ రోజు దీక్షకు మద్దతు పలికిన బిజెపి నాయకులు
నారాయణపేట ఫిబ్రవరి 26:
న్యాయవాద పరిరక్షణ చట్టం అమలు కొరకై గత నాలుగు రోజులుగా నారాయణపేట కోర్టు ముందు దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు నాలుగవ రోజు గురువారం బిజెపి నాయకులు సంఘీభావం తెలిపారు.బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య నాయ కత్వంలో బిజెపి కార్యకర్తలు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపినారు. సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం న్యాయవాది రఘువీర్ యాదవ్ ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి ఫెడరే షన్ బార్ అసోసియేషన్ పిలుపుమేరకు అన్ని కోర్టుల పరిధిలో నుండి రోడ్డెక్కి పాద యాత్రలు చేస్తున్న న్యాయవా దులకు పాదయాత్రలకు మద్దతుగా నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షు డు దామోదర్ గౌడ్ ఆధ్వ ర్యంలో నాలుగు రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నారని అన్నారు. దీక్షలో ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి కోట కొండ సీతారామారావు కురుమన్న గౌడ్ టి రామ చంద్రయ్య లక్ష్మీపతి గౌడ్ కే నరసింహులు క్రాంతి కుమార్ సంజన లక్ష్మీనారాయణ కృష్ణ పాల్గొనగా ఉదయము కాలేశ్వరం నాయకత్వంలో రాములు మోహన్ యాదవ్ మహేష్ యాదవులు పాద యాత్రకు బయలుదేరి వెళ్ళారు.సంఘీభావం తెలిపిన వారిలో బిజెపి నాయకులు కృష్ణ, లక్ష్మీకాంత్, బాబు,మల్లేష్,నక్క సత్యనా రాయణ,చలపతి,కు ర్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు
________________________
