ధన్వాడ పోలీస్ ఎస్సైగా వెంకటేష్ గౌడ్.
మహబూబ్నగర్ విఆర్లో విధులు నిర్వహిస్తూ ఉండగా, బదిలీపై ధన్వాడకు నియమితులయ్యారు.
నారాయణపేట ఫిబ్రవరి 25:
ధన్వాడ పోలీస్ స్టేషన్ నూత న ఎస్సై గా ఏ. వెంకటేష్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీక రించారు. ఆయన ఇంతకు ముందు మహబూబ్నగర్ విఆర్లో విధులు నిర్వహిస్తూ ఉండగా, బదిలీపై ధన్వాడకు నియమితులయ్యారు.
ఇప్పటి వరకు ధన్వాడ ఎస్సైగా విధులు నిర్వహించి న ఎస్సై రాజశేఖర్ మహబూ బ్నగర్ జిల్లా రాజాపూర్ పోలీ స్ స్టేషన్కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై ఏ. వెంకటేష్ గౌడ్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ని కార్యా లయంలో మర్యాదపూర్వకం గా కలిసి పూలమొక్క అంద జేశారు. ఈ సందర్భం గా ఎస్పీ నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవా లని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ, పోలీసులపై విశ్వాసం పెంపొం దించే విధంగా పని చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్సై ఏ. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి జిల్లా ఉన్నతాధి కారులకు కృతజ్ఞతలు తెలు పుతూ, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేం దుకు కృషి చేస్తానన్నారు. పోలీస్-ప్రజల మైత్రిని బలో పేతం చేస్తూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
ఫోటో రైట్ అప్:9.ఎస్పీని కలిసిన ధన్వాడ ఎస్సై
_____________________
