పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

అమ్మ నాన్న ఫౌండేషన్ అద్యక్షులు ప్రవీణ్ 

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులు, అనాధలు మరియు అవసరమైన వారికి అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరాలని ఆకాంక్షిస్తూ 55 మంది పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అద్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ