ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి 

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్.. 

ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది  రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.గంగాధర్,జిల్లా విద్యాధికారి యాదయ్యలతో కలిసి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఒక బృందానికి1పిఓ,1ఎపిఓ,3ఓపిఓ ల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68బృందాలు,చెన్నూరు మున్సిపాలిటీకి 36బృందాలు,క్యాతనపల్లి మున్సిపాలిటీకి 45బృందాలు,లక్షెట్టిపేట మున్సిపాలిటీకి 30బృందాలు,మంచిర్యాల నగరపాలక సంస్థకు 265బృందాలు రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించినట్లు ఆయన తెలిపారు.ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన స్థానాలలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బెల్లంపల్లిలో మున్సిపల్ కార్యాలయంలో,చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో,లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో,క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంచిర్యాల నగరపాలక సంస్థకు సంబంధించి నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసామని,8,9లలో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగం కోసం ఫారం 12,ఓటరు ఎపిక్ కార్డ్ తీసుకువెళ్లవలసి ఉంటుందని తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసామని,చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసామని,క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్కెసిఓఎ క్లబ్ లో సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసామని,లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్  పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News