బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్...

తీవ్ర అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులు..

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్...

IMG-20260207-WA0061మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల ప్రభుత్వ వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.విద్యార్థినిలను వెంటనే స్థానిక వంద పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బెల్లంపల్లి బస్తీలోని సమీకృత పాఠశాలలో రాత్రి విద్యార్థినిలకు మిల్ మేకర్ కూర వడ్డించారు.కూరలో పురుగులు ఉన్నాయనే విషయాన్ని విద్యార్థినులు వార్డెన్ దృష్టికి వెళ్లారు.అయినా పట్టించుకోకుండా వడ్డించారు.దీంతో అదే కూర తిన్న తర్వాత విద్యార్థినిలు వాంతులు చేసుకోగా,మరికొందరు సృహ కోల్పోయారు.చుట్టుపక్కల స్థానిక ప్రజలు గమనించి తమ కార్లు,ఇతర వాహనాల ద్వారా విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.వైధ్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వార్డెన్ ను సస్పెండ్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం