నూతన 'ఫుడ్ కోర్ట్' హోటల్‌ ప్రారంభోత్సవానికి 

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి ఆహ్వానం

నూతన 'ఫుడ్ కోర్ట్' హోటల్‌ ప్రారంభోత్సవానికి 

​ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 14 :

కారేపల్లి: సింగరేణి  మండల  కేంద్రంలో నూతనంగా  ఏర్పాటు  చేసిన "  ఫుడ్ కోర్ట్  " హోటల్ ప్రారంభోత్సవం  అంగరంగ వైభవంగా  నిర్వహించేందుకు నిర్వాహకులు  సిద్ధమయ్యారు. ఈ  ప్రారంభోత్సవ  కార్యక్రమానికి ముఖ్య  అతిథిగా విచ్చేయాల్సిందిగా  కోరుతూ, వైరా  నియోజకవర్గ  ఎమ్మెల్యే మాలోత్  రాందాస్  నాయక్  ని శనివారం  ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం  లో  ఫుడ్ కోర్ట్ యజమాని  ధరావత్  సుమంత్ నాయక్  మర్యాదపూర్వకంగా కలిసి  ఆహ్వాన  పత్రికను అందజేశారు.  ఈ  సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, మండల  కేంద్రంలో  ఆధునిక సౌకర్యాలతో  వెలుస్తున్న " ఫుడ్ కోర్ట్  "  స్థానికులకు  నాణ్యమైన రుచులను  అందించడమే కాకుండా,  స్థానికంగా  ఉపాధి అవకాశాలను  మెరుగుపరుస్తుందని   ఆకాంక్షించారు.
ఈ   కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్  హనుమంతరావు , కాంగ్రెస్  పార్టీ  సీనియర్ నాయకులు  అజ్మీర  హేమ్లా , అజ్మీర నరేన్ , అజ్మీర రవి ,  హట్కర్  రాంబాబు , అజ్మీరా అంకుష్ , అజ్మీరా  బాబు ,  ఇతర ముఖ్య  కార్యకర్తలు  పాల్గొన్నారు.
​నూతనంగా  ప్రారంభం  కానున్న ఈ " ఫుడ్  కోర్ట్  " సింగరేణి మండల  వాసులకు  కొత్త  రుచులను , ఉత్తమ వాతావరణాన్ని  అందిస్తుందని , దీని  ప్రారంభోత్సవం  మండల ప్రజలకు  పండుగ వాతావరణాన్ని  తీసుకువస్తుందని  స్థానికులు అభిప్రాయపడ్డారు .

Tags:

About The Author

Latest News

నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత
    కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి) జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్
అభివృద్ధి నిరంతర ప్రక్రియ....
శాఖాహారం అమృతహారం.
దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్ మత్రు నాయక్ 
ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 
రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన
*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *