రుద్రవరం గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం.
గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
(లోకల్ గైడ్, తెలంగాణ )
మిర్యాలగూడ మండలంలో పశు సంవర్ధక శాఖ, పశుగగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో మిర్యాలగూడ మండలం రుద్రవరం గ్రామం లో ఉచిత పశువైద్య శి
బిరం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ షేక్ బాను ప్రారంభించారు. తుంగపాడు పశువైద్యాధికారి డా. చింతా జ్ఞానేశ్వర్ ప్రసాద్ శిభిరానికి హాజరైన పశుపోషకులకు పాడి గేదెలు ఆవులలో సంభవించే గర్భకోశ సంబంధ వ్యాధులు వాటి నివారణ చర్యలను గురించి అవగాహన కల్పించడం జరిగింది. దామరచర్ల పశువైద్యాధికారి డా. సందీప్ కుమార్ లాభదాయక పశు యాజమాన్య పద్ధతులను వివరించారు. శిభిరం లో 63 పశువులకు చూడి పరీక్షలు , వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల వ్యాధులను గుర్తించి వైద్యం అందించి ఉచితం గా మందులు పంపిణీ చేశారు. 45 దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిమట జ్యోతి నాగయ్య, మాజీ సర్పంచ్ బొడ్డు మల్లయ్య , తుంగపాడు పశువైద్యాధికారి డాక్టర్ చింతా జ్ఞానేశ్వర్ ప్రసాద్ గారు
దామరచర్ల మండలం డాక్టర్ సందీప్ కుమార్ తుంగపాడు పశువైద్య సిబ్బంది ఎల్ ఎస్ ఏ లు నాగేందర్, శ్రీకాంత్, సహాయకుడు నరసయ్య,
సూపర్వైజర్ శివారెడ్డి,
గోపాలమిత్రలు విజేందర్, ప్రభాకర్, సందీప్, సైదులు గ్రామ రైతులు పాల్గొన్నారు.
