శేరిలింగంపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం

సైబరాబాద్ తొలి మున్సిపల్ కమిషనర్ జి.సృజన హామీ

శేరిలింగంపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సైబరాబాద్ మున్సిపల్ తొలి కమిషనర్ జి.సృజన ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ అల్లావుద్దీన్ పటేల్, చారి, లక్ష్మీ, కమల, రాము, షబ్బీర్, ముఖిద్ కలిసి పాల్గొన్నారు. ఈ భేటీలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, కాల్వలు, వీధి దీపాలు, పార్కులు వంటి అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు మున్సిపల్ శాఖ చురుకైన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ జి. సృజన శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పరిపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ..కమిషనర్ సానుకూల స్పందన ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ ప్రతినిధుల సమన్వయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ప్రాంత అభివృద్ధికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత వేగం చేకూర్చనుందని పార్టీ నాయకులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు