సైబరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

సైబరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయ వంతంగా ముగిసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి డబీల్‌పూర్ భారత్ బైబిల్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో, అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మజీద్‌పూర్ టీ శ్రీ చైతన్య స్కూల్‌లో కౌంటింగ్ నిర్వహించారు. అలాగే శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ ఇస్నాపూర్ కౌంటింగ్ కేంద్రంలో గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి గడ్డపోతారం జెడ్పీహెచ్ఎస్ కౌంటింగ్ కేంద్రంలో ఇంద్రేశం మున్సిపాలిటీ కి సంబంధించి పెదకంజర్ల సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాల్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అన్ని కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ నెల 16వ తేదీ వరకు అమలలో ఉంటుందని అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధులలో నిబద్ధతతో పనిచేసిన పోలీస్ సిబ్బందిని సీపీ డాక్టర్ ఎం.రమేష్ అభినందించారు. ఎన్నికల ప్రక్రియను శాంతి యుతంగా పూర్తి చేయడంలో పోలీసుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు